
నారద వర్తమాన సమాచారం
జూన్ :08
అక్షర యోధుడు రామోజీరావుకు ఘన నివాళి
అక్షర యోధుడు, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, సినీ నిర్మాత, పద్మభూషణ్ చెరుకూరి రామోజీ లేని లోటు తీరదని జైభీమ్ రావ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో అయన పాత్రికేయులతో మాట్లాడారు. పత్రికా రంగంలో దశాబ్దాలుగా అయన ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ అసామాన్య విజయాలు సాధించి పలువురికి ఆదర్శప్రాయుడైయ్యడని కొనియాడారు. ఆయన స్ఫూర్తి తో తాను సత్తెనపల్లిలో సుమారు పన్నెండేళ్లు ఈనాడు, ఈటీవీ పాత్రికేయునిగా సేవలు అందించానని తెలిపారు. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజలకు సేవలు అందించేందుకు రాజకీయల్లోకి వచ్చి సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేశానని తెలిపారు. మాలాంటి ఎందరికో స్ఫూర్తి నిచ్చిన ఆ మహనీయుడు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకురాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.