Tuesday, April 15, 2025
Homeభారత్ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం 18 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం 18 మంది దుర్మరణం

నారద వర్తమాన సమాచారం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం 18 మంది దుర్మరణం

:జులై 10
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు తెల్లవారుజామున ఘోరం ప్రమాదం చోటుచేసు కుంది.

ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌లో పాల ట్యాంకర్‌ను డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 18 మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలై నట్లు తెలుస్తుంది..

బుధవారం తెల్లవారు జామున 5.15 గంటల సమయంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందు కున్న ఉన్నావ్‌ పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.

క్షతగాత్రులను బస్సు నుంచి బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపిం చారు. బస్సు బీహార్‌ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమా దం జరిగినట్టు తెలిసింది..

కాగా గాయపడిన వారికి బంగార్‌మావ్‌ సీహెచ్‌సీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?