నారద వర్తమాన సమాచారం.
ఉపాధి హామీ పథకంలో
వేతన బకాయిలను చెల్లించాలి.
జి కొండూరు ప్రతినిధి.
విజయవాడ (గొల్లపూడి): జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలు సమస్యలను పరిష్కరించాలని అడిగిన వారికి వెంటనే పనులు కల్పించాలని వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా పిడికి వినత పత్రం సమర్పించడం మైనది
కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ అందజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పలు మండలాలు, గ్రామాలలో పర్యటించిన సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం దృష్టికి వచ్చిన సమస్యలను మెమోరండ రూపంలో అందజేయటం జరిగిందని ప్రధానంగా .చందర్లపాడు మండలం చందర్లపాడు లో ఉపాధి హామీ పనులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లాలో వేతన బకాయిలు నాలుగు నుంచి ఐదు వారాలు ఉన్నాయని వీటిని వెంటనే విడుదల చేయాలని కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని కష్టపడి పనిచేసిన రోజు వేతనం 270 రూపాయలకు మించట్లేదని కూలి పెంచాలని ఆయన ప్రభుత్వ డిమాండ్ చేశారు.
మరియు మచ్చర్లు పని ప్రదేశంలో వెయ్యాలని మచ్చర్ సీట్లు మేట్లుకు అందుబాటులో ఉంచాలని పనిముట్లు ఇవ్వాలని మంచినీరు ట్రాన్స్పోర్ట్ చార్జీలు పలుకు పారులకు డబ్బులు ఇవ్వలేదని ఆయన అన్నారు. అదికారులు జోక్యం చేసుకుని ఉపాధి హామీ పనులు సమర్దవంతంగా అమలు జరిగే విధంగా కృషి చేయాలని కోరారు
ఈకార్యక్రమంలో సిఐటియు నాయకులు యం.సోమేశ్వరావు,టి.నరసిహరావు తదితరులు పాల్గొన్నారు.