Wednesday, April 16, 2025
Homeతెలంగాణఆదిలాబాద్బోథ్ నుండి కార్యాలయం తరలింపు ఆపాలి....

బోథ్ నుండి కార్యాలయం తరలింపు ఆపాలి….

కార్యాలయాల తరలింపుతో అభివృద్ధి కుంటుపడుతుంది…

రిపబ్లిక్ హిందూస్థాన్, బోథ్ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రం నుండి కార్యాలయాల తరలింపు ఆపాలని , తరలిపోయిన కార్యాలయాలను వెనక్కి తిరిగి బోథ్ లో ప్రారంభించాలని బోథ్ బచావ్ ఆందోళన్ సమితి డిమాండ్ చేసింది. ఆదివారం రోజు బోథ్ మండలం లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఇందుమూలముగా సమస్త పాత్రికేయ మిత్రులకు & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు
నేడు బోథ్ మండల కేంద్రం నుంచి తరలిపోయిన కార్యాలయాలను వెనక్కు రప్పించాలని, నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, విద్యాసంస్థలను రప్పించాలని, 13 సమస్యలతో కూడినటువంటి ఉత్తరాలను స్థానిక శాసనసభ్యులు బోథ్ రాథోడ్ బాపురావు , స్థానిక పార్లమెంటు సభ్యులు సోయం బాపూరావులకు ఉత్తరాల ద్వారా వినతి పత్రాలు పంపించారు.
స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యువజన సంఘాల ఆధ్వర్యంలో కుల, మత ,రాజకీయ పార్టీలకతీతంగా సమావేశం ఏర్పాటు చేయడం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించ పలువురు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో లో యువజన సంఘల నాయకులు షేక్ షాకీర్, చంటి పసుల, మహేందర్ కూర్మే, షేక్ నాజర్ హమ్మద్,సల్ల రవి,సుమేర్ పాషా,శహబాస్,రుక్మణ్ సింగ్ సురేందర్ యాదవ్, బండారి శ్రీధర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, వార్డ్ నెంబర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?