Tuesday, April 15, 2025
Homeతెలంగాణపాతబస్తీలో అమిత్ షాపై కేసు.. ఉపసంహరించుకున్న పోలీసులు

పాతబస్తీలో అమిత్ షాపై కేసు.. ఉపసంహరించుకున్న పోలీసులు

నారద వర్తమాన సమాచారం

పాతబస్తీలో అమిత్ షాపై కేసు.. ఉపసంహరించుకున్న పోలీసులు

ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించారనే కారణంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై నమోదైన కేసును శనివారం చార్మినార్ పరిధిలోని మొఘల్ పురా పోలీసులు ఉపసంహరించారు. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.

అసలేం జరిగిందంటే..

మే 1వ తేదీన పాతబస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో మాధవి లత మాట్లాడుతుండగా.. వేదికపైకి ఇద్దరు బాలికలు వచ్చారు.

అమిత్ షా ఆ చిన్నారులను తన వద్దకు రమ్మంటూ సైగ చేయడంతో.. ఆ చిన్నారులు షా వద్దకు వెళ్లారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తు.. మరో ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బార్ 400 సీట్లు అనే ప్లకార్డ్స్ ఉన్నాయి.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘించారంటూ బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఈసీ.. విచారణ జరపాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొఘల్ పుర పీఎస్‌లో సెక్షన్ 188 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ 1 – యమాన్ సింగ్, ఏ 2 – హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, ఏ 3 – కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏ 4 – రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, ఏ5 -ఎమ్మెల్యే రాజసింగ్ తో పాటు పలువురి పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు కొట్టివేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?