రంగారెడ్డి జిల్లా జనవరి 13
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
శనివారం ఉదయం షాద్ నగర్ రోడ్డు మార్గంలోని ఘాన్సీమియాగూడ సమీ పంలో వేగంగా వచ్చిన ఓ షిఫ్టు కారు, ఆటో, బైక్ లు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ కల్వర్టులోకి దూసుకెళ్లాయి.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు మృతి చెందారు.ఆటో, బైక్ పై వెళ్తున్న పలువురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసు లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షత గాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయ నున్నట్లు పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on