Friday, April 18, 2025
Homeదైవ దర్శనంరేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య

రేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య


ఉత్తర ప్రదేశ్: జనవరి 21
శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య‌లో ప‌లు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు భ‌క్తులు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా సోమ‌వారం అయోధ్య‌ ప్ర‌త్యేక శోభ‌ను సంత‌రించుకోనుంది.

రేపు సాయంత్రం పది లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించ నున్నట్లు రామజన్మభూమి ట్రస్టు తెలిపింది.

అందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలనే ఉపయోగించ నున్నట్లు పేర్కొంది. రామ మందిరం సహా రామ్‌ కీ పైడీ, కనక్‌ భవన్‌, గుప్తర్‌ ఘాట్‌, సరయు ఘాట్‌, లతా మంగేష్కర్‌ చౌక్‌, మనిరామ్‌ దాస్‌ చవానీ వంటి ప్రముఖ ప్రదేశాలన్నింటినీ దీపాలతో అలంకరిస్తామని తెలిపింది.

మరోవైపు ప్రాణప్రతిష్ఠ ళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడేళ్లుగా అయోధ్యలో దీపోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?