
నారద వర్తమాన సమాచారం
జూన్ :08
ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక
లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం
నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్
అక్కడి నుంచే సీఎస్కు ఆదేశాలు జారీ చేసినట్లు
సమాచారం. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని
రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు
సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఓ మీడియా
దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.