Wednesday, April 16, 2025
Homeతాజా సమాచారంబీఆర్ఎస్‌కు భారీ షాక్‌….బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న బీఆర్ఎస్ నేత‌లు

బీఆర్ఎస్‌కు భారీ షాక్‌….బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న బీఆర్ఎస్ నేత‌లు


వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లో బి అర్ ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.ఇటీవల బి అర్ ఎస్ పార్టీ కి చెందిన యువనేత గోగుల రాణాప్రతాప్ రెడ్డి రాజీనామా చేయగా,ఆయనను బీజేపీ లోని జిల్లా అధ్యక్షుడు గంట రవి ఆహ్వానించారు.

అయితే ఆయన వెళ్తూ ఆయనతో పాటు పురపాలక సంఘానికి చెందిన ఐదుగురు కౌన్సిలర్ల ను బీజేపీ లోకి తీసుకెళ్తున్నారు. పురపాలక బి అర్ ఎస్ ఫ్లోర్ లీడర్,7వ వార్డు కౌన్సిలర్ మినుముల రాజు,2వ వార్డు కౌన్సిలర్ జుర్రు రాజు,3వ వార్డు కౌన్సిలర్ లునావత్ కవిత వీరన్న,4వ వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు,17వ వార్డు కౌన్సిలర్ గోల్య నాయక్ లు బీజేపీ లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొనున్నారు.ఈ పరిణామం తో నర్సంపేట లో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?