రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ :
సిక్కింలో గ్యాంగ్టక్ నుంచి నాథులా వెళ్లే హైవేపై మంచు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన 23 మందిని రెస్క్యూ టీమ్ కాపాడి ఆస్పత్రికి తరలించింది. నాథులా పర్వత మార్గంలో భారీ హిమపాతం సంభవించడంతో 80 వాహనాల్లోని 350 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
సిక్కిం మంచు కొండచరియలు విరిగిపడ్డ ఘటన లో ఏడు కు చేరిన మృతుల సంఖ్య
Recent Comments
Hello world!
on