— హెల్మెట్ ధరించిన దక్కని ప్రాణం….
రిపబ్లిక్ హిందుస్థాన్,పెద్దపల్లి : జిల్లా కేంద్రం లో ఈ రొజు మంగళవారం మధ్యాహ్నం ప్రాంతంలో పెద్దపల్లి మండలం అందుగుల పల్లి వద్ద లారీ బైక్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో కాసార్ల సురేష్ కుమార్ (38) అనే ప్రభుత్వ ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందాడు. రామగుండం ఇరిగేషన్ శాఖ డివిజన్ నెం 7 లో కాసర్ల సురేష్ కుమార్(38) సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బసంత నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.