ఏపీ అసెంబ్లీ( AP Assembly )లో మరోసారి గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఈలలు వేస్తూ నిరసన తెలుపుతున్నారు. స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టిన టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు.
ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం( Tammineni Sitaram )పై పేపర్లు చింపి విసిరేశారు.

అలాగే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని( Tammineni Sitaram ) సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.